గోపీచంద్ విరాళం రూ. 26 లక్షలు
ABN , First Publish Date - 2020-04-07T09:57:43+05:30 IST
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కరోనాపై పోరాడుతున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి రూ.26 లక్షలు ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కరోనాపై పోరాడుతున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి రూ.26 లక్షలు విరాళం ఇచ్చాడు. ప్రధాని సహాయ నిధికి రూ.11 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5 లక్షలు సాయమందించాడు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వారు చేస్తున్న సేవకు నా వంతు చిరు సాయంగా రూ.26 లక్షల విరాళాన్ని అందించా’ అని గోపీచంద్ తెలిపాడు. ఇక, భారత స్టార్ క్యూయిస్ట్, వరల్డ్ చాంపియన్ పంకజ్ ఆడ్వాణీ.. ప్రధాని సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం అందించాడు.