ఇతను నిజమైన హీరో: మాజీ ఎంపీ కవిత

ABN , First Publish Date - 2020-03-26T18:47:24+05:30 IST

హైదరాబాద్: లాక్‌డైన్ నేపథ్యంలో కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సాయం చేసేందుకు తన కుమారుల సూచన మేరకు ఆదిలాబాద్‌కు చెందిన ఓ రైతన్న ముందుకొచ్చాడు.

ఇతను నిజమైన హీరో: మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సాయం చేసేందుకు తన కుమారుల సూచన మేరకు ఆదిలాబాద్‌కు చెందిన ఓ రైతన్న ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల అతనో ‘రియల్ హీరో.. చాలా ఇన్‌స్పైరింగ్’ అని ట్వీట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు అనే రైతు తిండి లేని నిరుపేదల కోసం రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్‌ను కవిత ట్విట్టర్‌ పోస్ట్ చేశారు. అంతేకాకుండా అతడిని ప్రశంసలతో ముంచెత్తుతూ రియల్ హీరో అని ట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-26T18:47:24+05:30 IST