ఆ హీరో ఓ నక్సలైట్.. నాలుగు పార్టీలు మారాడు.. మండిపడిన ఎంపీ!

ABN , First Publish Date - 2021-03-08T10:03:45+05:30 IST

తాజాగా బీజేపీలో చేరి పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తిపై అధికార తృణమూల్ పార్టీ మండిపడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సౌగత రాయ్.. మిథున్ చక్రవర్తిపై నిప్పులు చెరిగారు.

ఆ హీరో ఓ నక్సలైట్.. నాలుగు పార్టీలు మారాడు.. మండిపడిన ఎంపీ!

కోల్‌కతా: తాజాగా బీజేపీలో చేరి పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తిపై అధికార తృణమూల్ పార్టీ మండిపడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సౌగత రాయ్.. మిథున్ చక్రవర్తిపై నిప్పులు చెరిగారు. మిథున్ చక్రవర్తికి ఎలాంటి విశ్వసనీయతా లేదని, ప్రజలను ఆయన ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని రాయ్ తేల్చిచెప్పారు. ఇప్పటికి మిథున్ చక్రవర్తి నాలుగు సార్లు పార్టీలు మారారని, ఇప్పుడు కూడా ఈడీ కేసులు చూపించి బీజేపీ బెదిరించడంతోనే ఆ పార్టీలే చేరారని విమర్శించారు. ‘‘వాస్తవానికి మిథున్ చక్రవర్తి ఓ నక్సలైట్. ఆ తర్వాత సీపీఎం పార్టీలో చేరాడు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇదిగో ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీలో చేరాడు’’ అని ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-03-08T10:03:45+05:30 IST