హెడ్కానిస్టేబుల్ సత్యం మృతి
ABN , First Publish Date - 2021-05-11T05:30:00+05:30 IST
నగరంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ ఆర్. సత్యనారాయణ అలియాస్ సత్యం మంగళవారం మృతి చెందారు.
నెల్లూరు(క్రైం), మే 11: నగరంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ ఆర్. సత్యనారాయణ అలియాస్ సత్యం మంగళవారం మృతి చెందారు. కావలి పట్టణానికి చెందిన సత్యం 1992 బ్యాచ్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్గా, హెడ్కానిస్టేబుల్గా సత్యం విధులు నిర్వహించారు. గత నెలలో కరోనా బారిన పడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి ఎస్పీ భాస్కర్భూషణ్, ఏఎస్పీ వెంకటరత్నం, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కె. శ్రీలక్ష్మి, సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజా, ఇన్స్పెక్టర్ బాజీజాన్సైదా, పలువురు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.