ఆరోగ్య సూత్రాలు పాటించాలి
ABN , First Publish Date - 2020-06-04T09:33:49+05:30 IST
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట ..
రామభద్రపురం, జూన్ 3: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. బుధవారం అంగన్వాడీ సెంటర్-2లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నామని, పక్కా భవనాలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. పీహెచ్సీ వైద్యాధికారి సంజీవ నాయుడు, మాజీ సర్పంచ్ చొక్కాపు లక్ష్మణరావు, ఐసీడీఎస్ పీవో హెచ్ కామాక్షి, అంగన్వాడీ సూపర్వైజర్లు ఎర్రయ్యమ్మ, అమ్మరాజులు, రమా దేవి, వైసీపీ నేతలు పైడిరాజు, చంద్రశేఖర్, అప్పారావు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
బాడంగి: తెంటువలసలో సచివాలయం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంబంగి భూమి పూజ చేశారు. బొబ్బిలి రూరల్ సీఐ ప్రసాదరావు, డీఈ శర్మ, ఎంపీడీవో పట్నాయక్, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎస్ఐ సురేంద్రనాయుడు, పార్టీ నేతలు జగదీశ్వరరావు, రామారావు, అప్పలనాయుడు, తెంటు భాస్కరరావు, రామారావు, ఆవు సత్యనారాయణ పాల్గొన్నారు.
బొబ్బిలి: నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ , ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శంబంగిని రామభద్రపురం మండలానికి చెందిన వైసీపీ నేత పత్తిగుల్ల ఏకనాథ్ ఆధ్వర్యంలో సన్మా నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బూత్కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.