2వేల కోట్లతో వెంటిలేటర్లు: హెల్త్ సెక్రటరీ రాజేశ్
ABN , First Publish Date - 2020-08-05T08:00:21+05:30 IST
పీఎం కేర్స్ ఫండ్లోని రూ.2వేల కోట్లతో 50వేల వెంటిలేటర్లు సమకూర్చబోతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్
- భౌతిక దూరమే మంచి వ్యాక్సిన్: ఐసీఎంఆర్ డీజీ భార్గవ
న్యూఢిల్లీ, ఆగస్టు 4: పీఎం కేర్స్ ఫండ్లోని రూ.2వేల కోట్లతో 50వేల వెంటిలేటర్లు సమకూర్చబోతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్కు 30వేలు, ఏపీలోని మెడ్టెక్ జోన్కు 13500, ఏజీవీఏకు 10వేల వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు, సమీప భవిష్యత్తులో కూడా భౌతిక దూరమే మంచి వ్యాక్సినని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు.