వాక్సినేషన్‌ విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-01-19T06:14:35+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి విశ్వేశ్వరరావు సందర్శించారు.

వాక్సినేషన్‌ విజయవంతం చేయాలి
వ్యాక్సినేషన్‌పై వివరాలు ఆరా తీస్తున్న విశ్వేశ్వరరావు

మదనపల్లె క్రైం, జనవరి 18: మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సోమవారం వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్‌వో) పరిశీలకుడు విశ్వేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్‌ అమలు తీరు, రిజిస్ర్టేషన్‌ తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విడతల వారీగా అందరికీ టీకా అందించి వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలని సూచించారు. సోమవారం 70 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు నోడల్‌ అధికారి అనుపమ చెప్పారు. 

Updated Date - 2021-01-19T06:14:35+05:30 IST