గుండెపోటు రోగికి చికిత్స చేస్తూ.. ఆగిన వైద్యుడి గుండె!

ABN , First Publish Date - 2021-11-29T09:09:59+05:30 IST

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి చికిత్స చేస్తూ.. తను కూడా గుండెపోటుకు గురయ్యారు ఓ వైద్యుడు.

గుండెపోటు రోగికి చికిత్స చేస్తూ.. ఆగిన వైద్యుడి గుండె!

  • మరో ఆస్పత్రికి తరలిస్తుండగా.. రోగి కూడా మృతి


కామారెడ్డి, నవంబరు 28: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి చికిత్స చేస్తూ.. తను కూడా గుండెపోటుకు గురయ్యారు ఓ వైద్యుడు. ప్రాణం నిలబెట్టాలన్న తాపత్రయంలో ఒత్తిడికి గురయ్యారో ఏమో గానీ.. అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. ప్రాణం విడిచారు. దీంతో మరో ఆస్పత్రికి తరలించే క్రమం లో.. ఆ రోగి కూడా మరణించాడు. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఈ అనూహ్య ఘటన జరిగింది. స్థానిక గుజ్జుల్‌ తండాకు చెందిన రైతు జాగ్యానాయక్‌ (48)కు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు.. గాంధారిలోని ఓ ప్రైవేటుఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ లక్ష్మణ్‌ (43).. వెంటనే చికిత్స ప్రారంభించారు. అదే సమయంలో డాక్టర్‌ లక్ష్మణ్‌కు కూడా తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. వైద్యుడు మృతి చెందడంతో.. రోగి జాగ్యానాయక్‌ను కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడ

Updated Date - 2021-11-29T09:09:59+05:30 IST