భక్త జన సంద్రమైన బోయకొండ

ABN , First Publish Date - 2021-08-02T04:43:41+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం భక్త జన సంద్రంగా మారింది.

భక్త జన సంద్రమైన బోయకొండ
దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులు

చౌడేపల్లె, ఆగష్టు 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం భక్త జన సంద్రంగా మారింది.  ఉదయాన్నే ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు  స్వర్ణాభరణాలతో, పూలతో  అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిచారు. సుమారు 70వేల మంది భక్తులు తరలి రావటంలో క్యూలైన్లు కిక్కిరిశాయి. గంటల కొద్ది క్యూలైన ్లలో భక్తులు వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Updated Date - 2021-08-02T04:43:41+05:30 IST