చేపల మార్కెట్ వద్ద కిటకిట
ABN , First Publish Date - 2020-03-30T09:20:56+05:30 IST
చేపల మార్కెట్లలో ఆదివారం జనాలు క్యూ కట్టారు. సామాజిక దూరాన్ని కొందరు పాటిస్తే మరి కొందరు పట్టించు
వీరవాసరం, మార్చి 29 : చేపల మార్కెట్లలో ఆదివారం జనాలు క్యూ కట్టారు. సామాజిక దూరాన్ని కొందరు పాటిస్తే మరి కొందరు పట్టించు కోలేదు. మాస్క్లు వేసుకోవాలని చెపుతున్నా అధికశాతం వీటిని పాటించలేదు. ఆదివారం మార్కెట్లో మాంసం, చేపల విక్రయాలు సాగుతున్నాయని తెలియటంతోనూ, ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ అమ్మకాలు జరుగుతాయని సమాచారం అందడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఆదివారం భీమవరం పట్టణ ప్రజలు తండోపతండాలుగా రావడంతో పట్టణంలోని యనమదుర్రు కాల్వగట్టు గంగానమ్మ గుడి ప్రాంతం వద్ద ఉన్న చేపల మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. దిరుసుమర్రు రోడ్డులోని చేపలబజార్లో చేపలు, రొయ్యల అమ్మకాల్లో నిబంధనలు పాటించకపోవడంతో మార్కెట్ నిర్వహించొద్దుని మునిసిపల్ కమిషనర్ కె.రమేశ్ కుమార్ ఆదేశించారు.