భారీగా గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-17T01:01:25+05:30 IST

జిల్లా పోలీసులు భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు

భారీగా గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా పోలీసులు భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో భద్రాచలంలో పోలీసుల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండేళ్లుగా 1.28 కోట్ల రూపాయల విలువైన గంజాయి అక్రమ రవాణా కేసులలో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T01:01:25+05:30 IST