గోదావరిఖనిలో భారీ వర్షం..
ABN , First Publish Date - 2021-06-14T06:00:56+05:30 IST
గోదావరిఖనిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
కళ్యాణ్నగర్/మార్కండేయ కాలనీ, జూన్ 13: గోదావరిఖనిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం 4గంటల ప్రాంతంలో చల్లగా మారింది. 4గంటల నుంచి 5గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్వద్ద ఓ చెట్టుకూలి విద్యుత్ వైర్లపై పడడంతో మూడ పోల్స్ విరిగి రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఓల్డ్ మున్సిపల్ ఏరియా, ఓల్డ్ అశోక, లక్ష్మీనగర్ ప్రాంతాలు అంధకారమయ్యాయి. రాత్రి 7.30గంటలకు ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో మినహా మిగతా ప్రాంతాలకు విద్యుత్ పునరుద్ధరించినట్టు సబ్ ఇంజనీర్ అవినాష్ పేర్కొన్నారు.