వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాక్టర్

ABN , First Publish Date - 2020-09-26T19:59:25+05:30 IST

ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. రావిపాడులో గుండ్లకమ్మవాగు ఉధృతికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది.

వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాక్టర్

ప్రకాశం: జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. రావిపాడులో గుండ్లకమ్మవాగు ఉధృతికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ సమయంలో ట్రాక్టర్లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చీరాల, కనిగిరి, అద్దంకి, గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లు వాగులను తలపించాయి. గిద్దలూరువద్ద తగిలేరువాగుకు వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


ప్రకాశం జిల్లాలోని రాచర్లలో అత్యధికంగా 20 సెం.మీ., గిద్దలూరులో 15.3 సెం.మీ., అద్దంకిలో 15 సెం.మీ. వర్షపాతం నమోదయింది. రాచర్ల మండలం, గుడిమెట్టలో గ్రామ చెరువు పొంగిపొర్లుతోంది. వరద నీరు గ్రామంలోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తగిలేరువాగు ఉధృతికి బ్రిడ్జిపైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నాగులుప్పాడు మండలం, మద్దిరాల, ఉంకోలు, దుద్దుకూరు, గంగారంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2020-09-26T19:59:25+05:30 IST