తిరుమల కనుమ దారిలో వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2021-11-18T23:00:54+05:30 IST

కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారిలో హరిణి దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ వర్షం కారణంగా ...

తిరుమల కనుమ దారిలో వర్ష బీభత్సం

తిరుమల: కనుమ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారిలో హరిణి దగ్గర ఈ ఘటన జరిగింది. భారీ వర్షం కారణంగా పాపవినాశనం రహదారిని టీటీడీ అధికారులు మూసేశారు. మరోవైపు భారీ వర్షాలతో తిరుపతి జలమయమైంది. అటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగాయి. 


మరోవైపు ఆర్జితం కార్యాలయం సమీపంలోని తిరుమల విపత్తు నిర్వహణ కేంద్రంలోపలికి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగింది. 

Updated Date - 2021-11-18T23:00:54+05:30 IST