కడప: పొంగుతున్న గుంజన ఏరు

ABN , First Publish Date - 2021-11-19T00:06:10+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో

కడప: పొంగుతున్న గుంజన ఏరు

కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని గుంజన ఏరు పొంగుతోంది. దీతో కోడూరు, రెడ్డివారి పల్లి గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని శాంతి నగర్, నరసారాం పేట, ఆంజనేయస్వామి గుడి వీధి , ధర్మాపురంలో పలు ఇళ్లలోకి గుంజన ఏరు వరద నీరు చేరింది. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. 




అలాగే   రైల్వే కోడూరు మండలంలోని శేషాచలం అడవుల్లోగల బాలపల్లి వద్ద హైవే రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో కోడూరు, తిరుపతి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వదర కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాటర్ ఫాల్స్ చూసేందుకు రోడ్డుపై దిగిన వ్యక్తి జాతీయ రహదారిపై దారి వెంటే కొట్టుకుపోయాడు. లోయలో పడిపోయాడా, బయట పడ్డాడా అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. 




Updated Date - 2021-11-19T00:06:10+05:30 IST