తుఫాను బాధిత రైతాంగానికి చేయూత

ABN , First Publish Date - 2020-11-28T05:35:39+05:30 IST

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతాంగా నికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ తక్షణ సాయం అందజేశారు.

తుఫాను బాధిత రైతాంగానికి చేయూత
రైతులకు ఆర్థికసాయం అందజేస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ

వంద మంది రైతులకు రూ.వెయ్యి చొప్పున సాయినాథ్‌శర్మ ఆర్థికసాయం

కమలాపురం, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ బాధిత రైతాంగా నికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ తక్షణ సాయం అందజేశారు. తుఫాను కారణంగా మండల పరిధిలో దెబ్బతిన్న పంటల ను సాయినాథశర్మ శుక్రవారం పరిశీలించారు. జంబాపురం దళితవాడ, చలితిమ్మాయిపల్లె, గొల్లపల్లె, కొండాయపల్లె, అప్పారావుపల్లె, ఈడిగపల్లె, తదితర గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలకు తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున దాదాపు 100 మందికి నగదు అందించారు. ప్రతి రైతు వేలాది రూపాయలు అధిక వడ్డీలకు అప్పు చేసి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో వర్షం కారణంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారన్నారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని రైతులకు ధైర్యం చెప్పారు.

Updated Date - 2020-11-28T05:35:39+05:30 IST