రాజేష్‌ కుటుంబసభ్యులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రోశయ్య

ABN , First Publish Date - 2021-07-12T14:11:42+05:30 IST

బోర్‌ వర్కర్‌ మంచాల రాజేష్‌పై..

రాజేష్‌ కుటుంబసభ్యులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రోశయ్య

పొన్నూరు: బోర్‌ వర్కర్‌ మంచాల రాజేష్‌పై దాడి చేసిన ఘటనపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి బాధితుడి కుటుంబసభ్యులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కేవీ రోశయ్య స్పష్టం చేశారు. రాజేష్‌ పై జరిగిన దాడి గురించి ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంకినీడు చౌదరి చేసినా.. మరొకరు చేసినా తప్పును మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. మంచాల రాజేష్‌ అతని కుటుంబసభ్యులు పట్టణంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఘటనకు దారితీసిన కారణాలను రాజేష్‌ను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్నివిధాల అండగా ఉంటానని భరోసానిచ్చారు. చట్టపరంగా కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. అంకినీడు చౌదరిపై చర్యలు తీసుకునే విధంగా పార్టీ అధిష్టానికి తెలియపరుస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-07-12T14:11:42+05:30 IST