‘ప్రభుత్వ’ విద్యార్థుల కోసం రూ.5లక్షలతో నిధి ఏర్పాటు
ABN , First Publish Date - 2021-08-04T06:55:59+05:30 IST
బాలాపూర్, మల్లాపూర్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అవసరాకోసం రూ.15 లక్షల ప్రత్యేక నిధి
పీపీఆర్ ట్రస్ట్ చైర్మన్ పర్వతాల్రెడ్డి
సరూర్నగర్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బాలాపూర్, మల్లాపూర్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అవసరాకోసం రూ.15 లక్షల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు మల్లాపూర్లోని పీపీఆర్ ట్రస్ట్ చైర్మన్ పన్నాల పర్వతాల్రెడ్డి ప్రకటించారు. సోమవారం రాత్రి పీపీఆర్ వృద్ధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్వతాల్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, సాయం అందజేస్తామని తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులు ఆయనకు జ్ఞాపికను అందజేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.