హేమంత్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-05T21:48:40+05:30 IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురి నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యకు

హేమంత్ హత్య కేసులో మరో నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురి నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యకు మొదట ఒప్పందం చేసుకున్న కిరాయి హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 10 లక్షల డీల్ మాట్లాడుకుని లక్ష అడ్వాన్స్ తీసుకున్నారు. డబ్బులు చేతికి అందగానే ఫోన్ ఆఫ్ చేయడంతో అవంతి మేనమామ యుగంధర్ మరో బిచ్చు గ్యాంగ్‌తో కలిసి మర్డర్‌కి కుట్రపన్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈ కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు లక్ష్మారెడ్డి, యుగంధర్ కస్టడీ ముగియడంతో వీరిద్దరిని కోర్టుకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2020-10-05T21:48:40+05:30 IST