మార్కెట్‌లోకి రోగ నిరోధక శక్తిని పెంచే హెరిటేజ్ పాలు

ABN , First Publish Date - 2020-09-18T22:03:28+05:30 IST

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. నేటి కాలానికి అనుగుణంగా అల్లం, తులసి, పసుపు ఫ్లేవర్‌లలో పాలను తీసుకొచ్చింది.

మార్కెట్‌లోకి రోగ నిరోధక శక్తిని పెంచే హెరిటేజ్ పాలు

హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. నేటి కాలానికి అనుగుణంగా అల్లం, తులసి, పసుపు ఫ్లేవర్‌లలో పాలను తీసుకొచ్చింది. ఈ మేరకు హెరిటేజ్ ప్రకటన విడుదల చేసింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో రెగ్యులేటరీ, థ్రోంబోటిక్‌ ప్రక్రియల కోసం అల్లం పాలు మేలు చేస్తాయని పేర్కొంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, వీటితో పాటుగా, శరీరంలో జీవక్రియలు మెరుగుపరిచేందుకు అల్లం తోడ్పడుతుందని నిరూపితమైందని పేర్కొంది. వేడి అల్లం పాలు కారణంగా గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గి గొంతు నొప్పి నుంచి ఉపశమనమూ కలుగుతుందని తెలిపింది.


హెరిటేజ్‌ తులసి పాలలో తులసి గుణాలుతో పాటుగా సబ్జా (స్వీట్‌ బాసిల్‌) విత్తనాలు, పుదీనా రసం ఉంటాయని, పాలలోని ఈ వనమూలికలు, చక్కటి రోగ నిరోధక వ్యవస్థను శరీరంలో పెంచేందుకు తోడ్పడతాయని తెలిపింది. వాతావరణ మార్పుల వేళ ఎదురయ్యే అనారోగ్యాల నుంచి కాపాడటంతో పాటుగా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తులసి తోడ్పడుతుందని చెప్పింది. తులసితో పాటుగా సబ్జా గింజలను కూడా జోడించి అందించడం వల్ల మానవ శరీరానికి మంచిదని తెలిపింది. ఇది కూలెంట్‌గా తోడ్పడుతుంది. 


ఇక పసుపులో చక్కటి యాంటీ మైక్రోబియాల్‌ లక్షణాలు ఉంటాయని,  బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఎదురయ్యే ఎన్నో వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ఫుడ్‌గా ఇది గుర్తించబడుతుందని పేర్కొంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పసుపు కలిగి ఉంటుందని నిరూపితం కావడం వల్ల కచ్చితమైన రోగ నిరోధక శక్తి బూస్టర్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. ఈ పాలను 90 రోజుల పాటు నిల్వ చేయవచ్చని, హెరిటేజ్‌ ఇమ్యూనిటీ మిల్స్‌ వేరియంట్స్‌లో ఎలాంటి కృత్రిమ నిల్వ పదార్థాలూ ఉండవని తెలిపింది. ఇవి సుప్రసిద్ధ ఆధునిక రిటైల్‌ స్టోర్లు, ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌, ఎంపిక చేసిన స్టాండలోన్‌ స్టోర్స్‌, ఎంపిక చేసిన హెరిటేజ్‌ ప్లార్లర్ల వద్ద 170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన పెట్‌ బాటిల్స్‌ రూపంలో బాటిల్‌ ఒక్కోటి 30 రూపాయలకు లభ్యమవుతాయని ప్రకటించింది.

 

ఇదిలా ఉంటే.. హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆవిష్కరించింది. వినియోగదారులు ఇప్పుడు అన్ని పాలు, పాల పదార్థాలను ఆన్‌లైన్‌లో ఈ యాప్‌ ద్వారా ఇంటి వద్దకే ఆర్డర్‌ చేసుకోవచ్చు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో  క్లాసిక్‌, వినూత్నమైన, ఉత్సాహపూరితమైన ఫ్లేవర్స్‌ను కుకీస్‌ అండ్‌ క్రీమ్‌, బెర్రీ రిపెల్‌ మరియు కారామిల్‌ రిపెల్‌లో విడుదల  చేసింది. రుచికరమైన ఐస్‌క్రీమ్‌తో కుకీక్‌, ఐస్‌క్రీమ్‌తో మిళితం చేసిన డార్క్‌ కుకీస్‌ గొప్పదనాన్ని కుకీస్‌ అండ్‌ క్రీమ్‌ ఐస్‌క్రీమ్‌ అందిస్తుంది. బెర్రీ రిపెల్‌లో  బెర్రీ రిపెల్‌ సాస్‌ మరియు కలర్డ్‌ చోకో బీన్స్‌ ఉన్నాయి. అదే సమయంలో, కారామిల్‌ రిపెల్‌లో కారామిల్‌ సాస్‌ మరియు వినోదాత్మక క్రిస్పీ చంక్స్‌ ఉంటాయి. రిపెల్‌ వేరియంట్స్‌  ఈ సీజన్‌లో మనోహరమైన రుచిని అందిస్తాయి. సండే ట్రాన్స్‌పరెంట్‌ కప్స్‌ రూపంలో లభ్యమవుతాయి.


హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా మాట్లాడుతూ ‘‘ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరిస్తుండం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. వినియోగదారుల ఆరోగ్యం, సంతోషం కోసం అవసరమైన ఉత్పత్తులను ఆవిష్కరించడంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. సరైన సమయంలో సృజనాత్మక ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా మాత్రమే దానిని చేరుకోగలము. వినియోగదారుల అవసరాలను హెరిటేజ్‌ ఫుడ్స్‌ అర్ధం చేసుకుంటుంది. ఎన్నో విలువ ఆధారిత ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను వినియోగదారులకు తీసుకురావడంలో ముందుంటుంది’’ అని అన్నారు.

 

Updated Date - 2020-09-18T22:03:28+05:30 IST