బీఎస్6 ప్రమాణాలతో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైక్ విడుదల

ABN , First Publish Date - 2020-11-11T00:06:35+05:30 IST

బీఎస్6 ప్రమాణాలతో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైక్ విడుదల

బీఎస్6 ప్రమాణాలతో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైక్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్పొ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజు భారత మార్కెట్‌లో కొత్త ఫీచర్లతో బీఎస్ 6-కంప్లైట్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది.


హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బీఎస్6 మోటార్‌సైకిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,15,715 ఉంటుంది. మూడు రంగుల్లో ఈ బైక్‌ను తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూంల్లో బీఎస్ 6-కంప్లైంట్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైక్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2020-11-11T00:06:35+05:30 IST