గ్రూప్‌ 1 పిటిషన్లపై ముగిసిన వాదనలు

ABN , First Publish Date - 2020-10-21T08:25:45+05:30 IST

గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షా ప్రశ్నపత్రంలో చోటు చేసుకున్న తప్పుల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామంటూ అభ్యర్థులు హైకోర్టులో

గ్రూప్‌ 1 పిటిషన్లపై ముగిసిన వాదనలు

రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు


అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షా ప్రశ్నపత్రంలో చోటు చేసుకున్న తప్పుల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామంటూ అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లపై వాదనలు మంగళవారం ముగిశాయి. దీంతో ఈ అంశంంపై గురువారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే, సదరు ప్రశ్నపత్రంలో పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న 26 ప్రశ్నలు.. ఇప్పటికే తొలగించిన 25 ప్రశ్నల్లో ఉన్నాయా? లేవా? అన్నది బుధవారం స్పష్టం చేయాలని ఏపీపీఎ్‌ససీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లలో కొంతమంది తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఏపీపీఎ్‌ససీ తరఫు న్యాయవాది ఆర్‌వీ మల్లిఖార్జునరావు వాదనలు వినిపించారు. 

Updated Date - 2020-10-21T08:25:45+05:30 IST