సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్‌ఈసీ అప్పీల్

ABN , First Publish Date - 2020-12-05T18:13:22+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ అప్పీల్ చేసింది.

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్‌ఈసీ అప్పీల్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నెరేడ్ మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని కోర్టుకు ఎస్ఈసీ తెలియజేసింది. అయితే సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని హైకోర్టు పేర్కొంది. సోమవారం ఉదయం మొదట ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జిను ధర్మాసనం ఆదేశించింది.



Updated Date - 2020-12-05T18:13:22+05:30 IST