మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం

ABN , First Publish Date - 2021-11-05T00:15:01+05:30 IST

రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నాల్గవ రోజు పాదయాత్రలో హైకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.

మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం

గుంటూరు: రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నాల్గవ రోజు పాదయాత్రలో  హైకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు మహిళలు హరతులు ఇచ్చారు. న్యాయవాదులే దేవుళ్లు అంటూ మహిళలు హరతులు ఇచ్చారు. అమరావతి మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. న్యాయస్దానం నుంచి దేవస్దానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. మొక్కవోని దీక్షతో పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి.

Updated Date - 2021-11-05T00:15:01+05:30 IST