మంథని లాకప్డెత్పై హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-07-01T00:53:03+05:30 IST
మంథని పీఎస్లో శీలం రంగయ్య లాకప్డెత్పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: మంథని పీఎస్లో శీలం రంగయ్య లాకప్డెత్పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది నాగమణి దంపతుల హత్యకు గురికాక ముందు రాసిన లేఖపై మరోసారి విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. శీలం రంగయ్య లాకప్ డెత్పై విచారణను ఆగస్టు 18కి హైకోర్టు వాయిదా వేసింది.
పెద్దపల్లి జిల్లా మంథని పోలీసు స్టేషన్లో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శీలం రంగయ్య పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న బాత్రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.