రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-07-08T01:12:07+05:30 IST
రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుకు 4 వారాల సమయాన్ని ప్రభుత్వం కోరింది. అయితే రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరారు. వారంలో గెజిట్ జారీ చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.