ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-03-04T01:25:05+05:30 IST

ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు నిలిపివేయాలన్న బీసీ కమిషన్

ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు నిలిపివేయాలన్న బీసీ కమిషన్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అధ్యాపకుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఇఫ్లూకి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం షరతు విధించింది. గతంలో బీసీ కమిషన్‌కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ నిలిపివేయాలని జనవరి 21న జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులపై హైకోర్టును  ఇఫ్లూ ఆశ్రయించింది.

Updated Date - 2021-03-04T01:25:05+05:30 IST