ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జి అభ్యంతరం

ABN , First Publish Date - 2020-09-19T00:20:26+05:30 IST

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. ప్రతి పనికి

ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జి అభ్యంతరం

గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. ప్రతి పనికి అడ్డుతగులుతున్నారు.. పరిపాలన కూడా వారినే చేసుకోమనండని ఏజీ వ్యాఖ్యానించారు. ‘మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? హైకోర్టు నా?.. లేక పిటిషనర్లనా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రతివాదులుగా ఉన్న అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులను కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - 2020-09-19T00:20:26+05:30 IST