కేసీఆర్ సర్కార్ తీరుపై ఆశ్చర్యపోయిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-04T18:52:56+05:30 IST

రూ.58 కోట్ల మంజూరుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది...

కేసీఆర్ సర్కార్ తీరుపై ఆశ్చర్యపోయిన హైకోర్టు

హైదరాబాద్ : కోర్టు ధిక్కరణ కేసు విచారణ ఖర్చుల కోసం.. రూ.58 కోట్ల మంజూరుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. నిధులు విడుదల చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. సీఎస్ సోమేష్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా హైకోర్టు వేసింది. అప్పటివరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-08-04T18:52:56+05:30 IST