పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల పెంపును కొట్టివేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-01-19T22:17:47+05:30 IST

రాష్ట్రంలోని పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన

పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల పెంపును  కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల పెంపును హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అయితే టీఏఎఫ్ఆర్‌సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులను పెంచిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ అనంతరం పీజీ వైద్య ఫీజుల పెంపుపై సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ తీర్పునిచ్చింది. 

Updated Date - 2022-01-19T22:17:47+05:30 IST