భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-05-27T22:20:55+05:30 IST

అమరావతి: భూముల అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన జీవోను సస్పెండ్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ

అమరావతి: భూముల అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన జీవోను సస్పెండ్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. డాక్టర్‌ శైలజ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది డీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఏడాదిగా ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రూ.వేల కోట్లు దుర్వినియోగం చేసి.. ప్రభుత్వ స్థలాలు అమ్మడం తగదన్నారు. నవరత్నాల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు. ఈ టైమ్‌లో కూడా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని న్యాయవాది ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-27T22:20:55+05:30 IST