ఇంటి స్థలాలపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-07-14T11:00:36+05:30 IST

పేదల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీలో అన్యాయం..

ఇంటి స్థలాలపై హైకోర్టు స్టే

మద్దికెర, జూలై 13: పేదల అభ్యున్నతే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీలో అన్యాయం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం చివరికి కోర్టు దాకా వెళ్లింది. పేదల ఇళ్ల స్థలాల జాబితాలో అధికార పార్టీకి చెందిన అనర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. మండల కేంద్రమైన మద్దికెర గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మొత్తం 24.60 ఎకరాల భూమిని కేటాయించింది.


640 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి లేఅవుట్లు కూడా చేశారు. అయితే ఆ జాబితాలో అధికార పార్టీ నాయకులకు, వారి సమీప బంధువులకు ఎక్కువగా కేటాయించారనే విమర్శలు వచ్చాయి.  2005లో ఆ స్థలాల్లో కె.లలిత, యశోద, నాగవేణి, జి.వసంత, సరస్వతి, లక్ష్మి, గంగమ్మ, పులికొండమ్మ, పద్మావతి, ధనలక్ష్మిలకు సర్వే నెం.444/2బి, 552/2, 522/2, 552/2బిలో ఇళ్ల పట్టాలను ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్త జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. 15ఏళ్ల నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ పేదలకు కలగానే మిగిలిపోయింది. 


అర్హులకు మాత్రమే ఇస్తాం ..వెంకటలక్ష్మి, తహసీల్దార్‌ 

 అర్హులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తాం. అనర్హులకు ఇచ్చే ప్రసక్తి లేదు. కోర్టుకు వెళ్లిన వారికి కూడా విచారణ జరిపి ఇళ్ల పట్టాలు ఇస్తాం. 

                                   

Updated Date - 2020-07-14T11:00:36+05:30 IST