హై జంపర్ తేజశ్విన్కు స్వర్ణం
ABN , First Publish Date - 2021-05-17T10:06:38+05:30 IST
అమెరికాలో జరుగుతున్న ‘బిగ్ 12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షి్పలో భారత హై జంపర్ తేజశ్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు.
మన్హట్టన్: అమెరికాలో జరుగుతున్న ‘బిగ్ 12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షి్పలో భారత హై జంపర్ తేజశ్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ పోటీల్లో కాన్సాస్ స్టేట్ వర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన తేజశ్విన్ ఫైనల్లో 2.28 మీటర్లు జంప్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. టర్నర్ (2.25 మీ), జాక్వన్ హొగాన్ (2.11) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 2019 టోర్నీలోనూ 22 ఏళ్ల తేజశ్విన్ పసిడి పతకం నెగ్గాడు. 2017 నుంచి కాన్సాస్ వర్సిటీలో స్కాలర్షి్పపై తేజశ్విన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేస్తున్నాడు.