అధిక ధరల ఘనత వైసీపీదే
ABN , First Publish Date - 2022-07-10T05:11:00+05:30 IST
ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతాయని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ అన్నారు.
టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్
మాడుగుల రూరల్, జూలై 9: ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతాయని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని వీరవల్లి అగ్రహారంలో బాదుడే బాదుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్తోపాటు విద్యుత్, బస్సు చార్జీలు పెంచి ప్రజలను పీక్కుతింటున్నారని ఆరోపించారు. సమన్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలన్నారు. అనంతరం కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అదట్రావు సత్యనారాయణ, పాచిల రమణ, శ్రీరామ్మూర్తి, వీరబాబు, అప్పలనాయుడు తదతరులు పాల్గొన్నారు.