LIVE: ఏడాది పాలన..63 మొట్టికాయాలు

ABN , First Publish Date - 2020-05-23T13:26:06+05:30 IST

LIVE: ఏడాది పాలన..63 మొట్టికాయాలు

LIVE: ఏడాది పాలన..63 మొట్టికాయాలు

అమరావతి: ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు. గతంలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం...ఏడాదిలో అనేక వివాదాస్పద నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. ఇప్పుడు ఒకే రోజు మూడు అంశాలపై జగన్‌ సర్కార్‌కు చుక్కెదురైంది. విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇంటలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావుకు కోర్టులో ఊరట లభించగా, గ్రామ సచివాలయాలకు రంగుల విషయంలో తమ ఆదేశాలు ఏమార్చడంపై హైకోర్టు మండిపడింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని సీఎస్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.


ఏడాది కాలం....దాదాపు 63 సార్లు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వానికి లేని స్థాయిలో ప్రభుత్వ తీరును తప్పు బడుతూ హైకోర్టు తీర్పులు ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తూనే ఉన్నాయి. చాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వానికి నిన్న వచ్చిన తీర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తప్పు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను తాము నమ్మలేని పరిస్థితులో ఉన్నాం వంటి మాటలను హైకోర్టు మాట్లాడటంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో నిర్వహించిన చర్చలో కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ, టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, బీజేపీ నేత భానుప్రకాష్, వైసీపీ నేత, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 



Updated Date - 2020-05-23T13:26:06+05:30 IST