డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2021-10-07T04:02:27+05:30 IST
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని హైకోర్టులో రేగు మహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ హైకోర్టు పిటిషన్పై ..
అమరావతి: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని హైకోర్టులో రేగు మహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ హైకోర్టు పిటిషన్పై విచారణ జరిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ అని జిల్లా స్థాయి కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్పై అప్పీలు చేశారు. అప్పీల్పై విచారణ జరపాల్సిన గిరిజన మంత్రి పుష్ప శ్రీవాణి కావటంతో వేరే అప్పీల్ అథారిటీని నియమించాలని న్యాయవాది పిటిషన్లో కోరారు. దీంతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ నవంబర్ 17కు వాయిదా వేసింది.