ఉన్నత పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2021-05-16T06:42:45+05:30 IST
ఉన్నత పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని విద్యా శాఖాధికారులకు, ఉపాధ్యాయులకు విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు.
విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు
కాకినాడ రూరల్, మే 15: ఉన్నత పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని విద్యా శాఖాధికారులకు, ఉపాధ్యాయులకు విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు. మండలంలోని తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానెల్స్ జిల్లాలో మొదటిదన్నారు. నాడు-నేడు పనుల్లోభాగంగా పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఉత్త్తమ బోధన అందిస్తే ఉన్నత పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా తయారవుతాయన్నారు. విషయ పరిజ్ఞానంతో కూడిన పాఠాలు, విజ్ఞానశాస్త్ర మెళకువలను విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాలను అభివృద్ధిచేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయిని కె.విజయదుర్గను అభినందించారు. కార్యక్రమంలో డీఈవో ఎస్.అబ్రహం, ఎంఈవో గణేష్బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.