పుజారా, రహానే ఘోర వైఫల్యం.. విరుచుకుపడుతున్న అభిమానులు

ABN , First Publish Date - 2022-01-04T00:44:47+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమింండియా సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, మాజీ వైస్ కెప్టెన్

పుజారా, రహానే ఘోర వైఫల్యం.. విరుచుకుపడుతున్న అభిమానులు

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే మరోమారు దారుణంగా విఫలమయ్యారు. పుజారా మూడు పరుగులు చేసి అవుట్ కాగా, రహానే గోల్డె‌న్ డక్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరూ  గత రెండేళ్లుగా విఫలమవుతూ వస్తున్నా జట్టులో మాత్రం చోటు దక్కించుకుంటున్నారు.


2020, 2021లో పుజారా సగటు వరుసగా 20.37, 30.42గా ఉంది. రహానే 2019 నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క సెంచరీ నమోదు చేశాడు. అతడి సగటు 40 లోపే పరిమితమైంది. పుజారా మాత్రం జనవరి 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 


రెండో టెస్టులో దారుణ వైఫల్యం తర్వాత వీరద్దరిపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీరిద్దరికీ ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి తర్వాతి టెస్టులకైనా వారి స్థానంలో యువకులకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరినీ తప్పించి శ్రేయాస్ అయ్యర్‌కు చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్‌లో 50 పరుగులు చేసి తర్వాతి నాలుగైదు టెస్టుల కోసం జట్టులో స్థానం సంపాదించుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తి పోస్తున్నారు. 

Updated Date - 2022-01-04T00:44:47+05:30 IST