హిజాబ్ వివాదంపై స్పందించిన నితీష్
ABN , First Publish Date - 2022-02-15T01:48:27+05:30 IST
కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం అర్ధరహితమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్..
పాట్నా: కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం అర్ధరహితమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. దీనిపై అసలు చర్చే అవసరం లేదని కొట్టివేశారు. తమ రాష్ట్రంలో ఇది ఒక అంశమే కాదని, మతపరమైన మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. తరగతి గదిలో కొందరు తమ తలపై ఏదో ధరిస్తే దానికి మనం ఏం చేస్తామని ప్రశ్నించారు. దానిపై వ్యాఖ్యానించాల్సిన పని లేదని అన్నారు.
''బీహార్ స్కూళ్లలో దాదాపు విద్యార్థులంతా ఒకేరకమైన దుస్తులు ధరిస్తారు. ఎవరో ఒకరు తమ తలపై ఏదో ఒకటి ధరిస్తే దానిపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోరాదు. మనం ప్రతి ఒక్కరి మతమరమైన మనోభావాలను గౌరవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ సమానమే'' అని నితీష్ అన్నారు. 'జనతా కే దర్బార్ మే ముఖ్యమంత్రి' అనే పోగ్రాం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నితీష్ తాజా వ్యాఖ్యలు చేశారు.