అర్ధరాత్రి డీజేలు పెట్టి హిజ్రాలతో శ్మశానంలో చిందులు
ABN , First Publish Date - 2021-06-13T17:35:43+05:30 IST
అర్ధరాత్రి డీజేలు పెట్టి హిజ్రాలతో చిందులేసిన ..
- అర్ధరాత్రి హిజ్రాలతో..
- సోదరి వివాహం నేపథ్యంలో వేడుక
- సోషల్ మీడియాలో వీడియోలు,
- ఐదుగురిపై కేసు
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : అర్ధరాత్రి డీజేలు పెట్టి హిజ్రాలతో చిందులేసిన వారిపై హబీబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సుబాన్పురా దర్గా షా ఖామూష్లో ఉండే ఆమీర్ సోదరి వివాహం శనివారం ఉదయం ఉండడంతో శుక్రవారం రాత్రి మెహిందీ వేడుకలు ఏర్పాటు చేశాడు. దర్గా షాలోని శ్మశాన వాటికలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో డీజేలు పెట్టి పెద్ద సంఖ్యలో యువకులు చిందులేశారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు హిజ్రాలను పిలిచి వారితో కలిసి రాత్రంతా డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లాయి. డీజే సామగ్రిని స్వాధీనం చేసుకుని, ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. మాన్గార్ బస్తీలో కత్తులతో జన్మదిన వేడుకలు చేసుకున్న ఘటనలో తొమ్మిది మంది జైలుకెళ్లి ఒకరోజు కూడా గడవక ముందే మరో దగ్గర వేడుక పేరుతో అర్ధరాత్రి యువకులు చిందులేయడం చర్చనీయాంశంగా మారింది.