ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రూ.500కే: ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-12T23:43:49+05:30 IST

ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రూ.500కే: ప్రభుత్వం

ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రూ.500కే: ప్రభుత్వం

సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను రూ. 500కే  చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇళ్ల వద్దకు వెళ్లి కోవిడ్ నమూనాలను సేకరిస్తే అందుగానూ రాష్ట్ర ప్రభుత్వం ధరను రూ. 750గా నిర్ణయించింది. రాష్ట్రంలో 18-44 ఏళ్ల వయసు వారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-12T23:43:49+05:30 IST