శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ

ABN , First Publish Date - 2021-09-29T06:25:16+05:30 IST

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ సంజయ్‌కుందూ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ
సంజయ్‌కుందూకు ప్రసాదాలు అందజేస్తున్న ఈవో

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 28: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌ డీజీపీ సంజయ్‌కుందూ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. తొలుత డీజీపీ రూ.5వేల రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుని, తర్వాత ముక్కంటీశుడిని దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ విశ్వనాథ్‌, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T06:25:16+05:30 IST