కరోనాతో హిందీ ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2021-05-18T05:38:26+05:30 IST
పీలేరు పట్టణంలో కరోనా వ్యాధి బారినపడి హిందీ ఉపాధ్యాయుడు షంషీర్(42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు.
పీలేరు, మే 17: పీలేరు పట్టణంలో కరోనా వ్యాధి బారినపడి హిందీ ఉపాధ్యాయుడు షంషీర్(42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. షంషీర్ కొన్ని రోజులుగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ప్రస్తుతం వి.కోట మండలం ధనమయ్యగారి పల్లెలోని ప్రాథమి కోన్నత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఆయన గతంలో పీలేరు మండలం ఎనములవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో పని చేశారు. షంషీర్ మృతి పట్ల ఏస్టీయూ నాయకుడు బాలకృష్ణరెడ్డి, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.