హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-04-14T05:26:36+05:30 IST

హిందూ ధర్మం, హైందవ సాంప్రదాయాలను కాపాడుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర ధర్మప్రచార విభాగ ప్రముఖ్‌ పొగిరి సూర్యానారాయణ అన్నారు.

హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
డైరీని ఆవిష్కరిస్తున్న ఎన్‌ఈఆర్‌

రణస్థలం: హిందూ ధర్మం, హైందవ సాంప్రదాయాలను కాపాడుకోవాలని విశ్వహిందూ పరిషత్‌  రాష్ట్ర ధర్మప్రచార విభాగ ప్రముఖ్‌ పొగిరి సూర్యానారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడుకుదిటి ఈశ్వరరావు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్‌ తెలుగు క్యాలెండర్‌, హిందూ దైనిందిని తెలుగు డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్‌ నడుకుదిటి రజిని,  బీజేపీ నేత ఆకెళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 


 


 

Updated Date - 2021-04-14T05:26:36+05:30 IST