భారత్‌కు అండగా నిలిచిన యూఏఈలోని హిందూ సమాజం

ABN , First Publish Date - 2021-05-15T15:17:07+05:30 IST

ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగుతోంది. దీంతో చాలా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత

భారత్‌కు అండగా నిలిచిన యూఏఈలోని హిందూ సమాజం

అబుధాబి: ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగుతోంది. దీంతో చాలా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. విదేశాల్లోని భారతీయులు కూడా వైద్య పరికరాలను స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అబుధాబిలోని హిందూ ఆలయానికి చెందిన కొందరు వలంటీర్లు అక్కడి భారతీయ పారిశ్రామిక వేత్తలతో కలిసి సోమవారం రోజు వందలాది ఆక్సిజన్ సిలిండర్‌లను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జెబెల్ అలీ పోర్ట్‌కు చేరుకుని ఆక్సిజన్ సిలిండర్‌లను ఇండియాకు తరలించడానికి షిప్‌లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా కొందరు వలంటీర్లు కాషాయ దుస్తుల్లో అక్కడికు వచ్చి ప్రార్థనలు చేశారు.  


Updated Date - 2021-05-15T15:17:07+05:30 IST