ఆర్టీసీ అద్దె బస్సు బోల్తా
ABN , First Publish Date - 2021-04-22T06:49:01+05:30 IST
గుడివాడ డిపోకు చెందిన గుడివాడ- విజయవాడ ఆర్టీసీ పల్లె వెలుగు అద్దె బస్సు ఉంగుటూరు మండలం మానికొండ వద్ద బోల్తా కొట్టింది.
త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
ప్రయాణికులకు స్వల్పగాయాలు
గుడివాడ, ఏప్రిల్ 21 : గుడివాడ డిపోకు చెందిన గుడివాడ- విజయవాడ ఆర్టీసీ పల్లె వెలుగు అద్దె బస్సు ఉంగుటూరు మండలం మానికొండ వద్ద బోల్తా కొట్టింది. విజయవాడ నుంచి గుడివాడ వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి బస్సు మార్జిన్ దిగడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కాలువలో నీరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.