హెచ్ఎంలపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , First Publish Date - 2020-12-04T05:45:41+05:30 IST
అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ను విద్యా శాఖ అధికారులు ఎత్తివేశారు.
అనకాపల్లి, డిసెంబరు 3: అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ను విద్యా శాఖ అధికారులు ఎత్తివేశారు. తాళ్లపాలెం, మామిడిపాలెం, కూండ్రం, కొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలలను పీఆర్ ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఎస్ఎస్ఏ ఏసీపీ మల్లికార్జునరెడ్డి తనిఖీలు నిర్వహించి నాడు-నేడు పనుల్లో నాణ్యత లేదని నిర్ధారించారు. దీంతో బాధ్యులైన హెచ్ఎంలు వి.విజయలక్ష్మి, వి.దాసు, పీవీ సుబ్బారావు, డీఎస్ నాయుడులను సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ ఆర్జేడీ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాల ద్వారా హెచ్ఎంలు విద్యా శాఖ మంత్రికి తమ గోడు వినిపించుకున్నారు. ఈ మేరకు సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.