ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-05-18T06:25:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాథాన్యం ఇస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియం, వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు.

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం
అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ చల్లా అనురాధ

హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు(కార్పొరేషన్‌), మే 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాథాన్యం ఇస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియం, వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి మండలంలో రెండు హెల్త్‌ సెంటర్ల నిర్మిస్తుందన్నారు.  ఒక్కొక్క హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయించిందన్నారు. నగరంలో ఉన్న హెల్త్‌ సెంటర్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో 18 వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాలలో 10 బెడ్లతో పాటు 38 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌కే చెల్లుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ చల్లా అనురాధ, కార్పొరేటర్లు చల్లా రాజ్యలక్ష్మి, ఉడుముల లక్ష్మి, ఈరంటి వరప్రసాద్‌, బూసి రాజలత, నాయకులు యోగేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:25:31+05:30 IST