సామూహిక అత్యాచార నిందితులను గుర్తించాం: సుచరిత

ABN , First Publish Date - 2021-06-25T19:40:08+05:30 IST

సామూహిక అత్యాచార నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు పూర్తి కాగానే వివరాలు

సామూహిక అత్యాచార నిందితులను గుర్తించాం: సుచరిత

గుంటూరు: సామూహిక అత్యాచార నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. మహిళల రక్షణ కోసమే దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ఇప్పటివరకు 15 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. తాడేపల్లి సామూహిక అత్యాచారం ఘటన తర్వాత.. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

Updated Date - 2021-06-25T19:40:08+05:30 IST