ఇలా చేసి చూడండి!
ABN , First Publish Date - 2021-02-08T05:37:28+05:30 IST
వేపాకులను మజ్జిగతో మెత్తగా రుబ్బి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే సాంత్వన లభిస్తుంది. కప్పు నీళ్లల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాలపొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి...
- వేపాకులను మజ్జిగతో మెత్తగా రుబ్బి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే సాంత్వన లభిస్తుంది.
- కప్పు నీళ్లల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాలపొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
- ఎండలో బాగా తిరగడం వల్ల తలనొప్పిగా ఉంటే చిన్న అల్లంముక్కను నూరి నిమ్మరసంతో తాగితే ఉపశమనంగా ఉంటుంది.
- మతిమరుపుతో ఇబ్బందిపడుతున్న వాళ్లు తేనె తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లిపాయలను తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
- ఆరువంతుల నారింజరసానికి ఒక వంతు క్యారట్ రసం, ఒక వంతు నిమ్మరసం చేర్చి ఆ మిశ్రమాన్ని సగం కప్పు రోజూ తాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
- కొబ్బరినూనె, నిమ్మరసాలను సమపాళ్లల్లో తీసుకుని పేస్టులా చేసి దాన్ని మోకాళ్లకు రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
- తేనెటీగ కుడితే దానిపై ఉల్లిపాయ రసం పూయాలి. అలా చేస్తే ఆ ప్రాంతంలో వాపు, నొప్పి తగ్గుతాయి.
- అరికాళ్లు మంటలుగా ఉంటే నెయ్యి లేదా సొరకాయగుజ్జు రాస్తే ఉపశమనంగా ఉంటుంది.